తిరుమల లడ్డుపై వివాదం వద్దు

తిరుమల లడ్డుపై వివాదం వద్దు

జనం న్యూస్ 24 సెప్టెంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

తిరుమల లడ్డుపై గత రెండు రోజులుగా జరుగుతున్న వివాదంపై నేషనలిస్ట్ జనశక్తి పార్టీ పెందుర్తి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్ కుమార్ శర్మ ( ఏలూరు వెంకటరమణ )స్పందిస్తూ తిరుమల లడ్డు పై వివాదం రావడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ

ఎంతోమంది భక్తుల మనోభావాలతో ముడి ఉన్న ఈ అంశాన్ని వివాదం చేయొద్దని విచారణ మాత్రం కచ్చితంగా చేయాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇలాంటి వివాదాలు భవిష్యత్తులో అవకాశం లేకుండా చూడాలని ప్రభుత్వానికి టిటిడి అధికారులకు విజ్ఞప్తి చేశారు.